ఎన్రోల్మెంట్కు అధ్యాపకులు ఇంటింటా ప్రచారం
ABN , Publish Date - May 23 , 2024 | 12:45 AM
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంపునకు అధ్యాపకులు ఇంటింటికి వెళ్లిప్రచారం చేస్తున్నారు.
![ఎన్రోల్మెంట్కు అధ్యాపకులు ఇంటింటా ప్రచారం](https://media.andhrajyothy.com/media/2024/20240511/22kut3_87b8e39671.jpg)
కోటవురట్ల, మే 22: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంపునకు అధ్యాపకులు ఇంటింటికి వెళ్లిప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది టెన్త్ క్లాసు పాస్ అయిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రైవేట్ కాలేజ్లకు దీటుగా బోధన చేస్తామని, కళాశాలలో మెరుగైనా మౌలిక సదుపాయలు ఉన్నాయని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది కళాశాలలో ఇంటర్ ఫలితాలలో అనేకమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి బ్రోచర్స్ను అందజేస్తున్నారు. బుధవారం మండలంలో యండపల్లి, సుంకపూర్, లింగాపురం, తంగేడు గ్రామాల్లో అధ్యాపకులు బృందం ఇంటింటికి తిరిగి విద్యార్లు ఎన్రోల్మెంట్ పెంపునకు కృషి చేస్తున్నారు.