Share News

నేడు రక్షణ శాఖా మంత్రి రాక

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:54 AM

కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్‌సింగ్‌ మంగళవారం నగరానికి రానున్నారు.

నేడు రక్షణ శాఖా మంత్రి రాక

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్‌సింగ్‌ మంగళవారం నగరానికి రానున్నారు. ఆయన మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 11.55 గంటలకు వీఎంఆర్‌డీఎ చిల్డ్రన్‌ ఎరీనాకు చేరుకుని బీజేపీ ఏర్పాటుచేసే మేధావుల సమావేశంలో పాల్గొంటారు. సమావేశం అనంతరం తిరిగి మధ్యాహ్నం 1.05 గంటలకు బయలుదేరి 1.25 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరం బయలుదేరి వెళతారు.

Updated Date - Feb 27 , 2024 | 01:54 AM