Share News

ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆందోళన

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:25 AM

ఉపాధి హామీ పనులు కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము డిమాండ్‌ చేశారు.

ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆందోళన
పెదపాడు సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న దృశ్యం

అచ్యుతాపురం, జూన్‌ 7: ఉపాధి హామీ పనులు కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము డిమాండ్‌ చేశారు. శుక్రవారం పెదపాడు పంచాయతీ కార్యాలయం ఎదుట ఉపాధి కూలీలతో ధర్నా నిర్వాహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పంచాయతీ పరిధిలో వారం నుంచి ఉపాధి హామీ పనులు నిలిపి వేశారన్నారు. మండు వేసవిలో పనులు చేయించి, వర్షాలు పడుతున్న సమయంలో ఆపి వేయడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సముద్రాలు, లక్ష్మి, అప్పలనర్సమ్మ, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 12:25 AM