చంద్రబాబు విశాఖ రాక రేపు
ABN , Publish Date - Jan 09 , 2024 | 01:25 AM
‘రా...కదలిరా..’ పేరుతో విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈనెల పదో తేదీన నిర్వహించనున్న బహిరంగసభకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.
విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
‘రా...కదలిరా..’ పేరుతో విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈనెల పదో తేదీన నిర్వహించనున్న బహిరంగసభకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. బుధవారం ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఆయన ఇక్కడ నుంచి హెలికాప్టర్లో బొబ్బిలి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. బొబ్బిలి సభ అనంతరం హెలికాప్టర్లో కాకినాడ జిల్లా తుని సమీపంలోని చామవరం వెళతారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు.