న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా బెవర సత్యనారాయణ
ABN , Publish Date - Apr 06 , 2024 | 01:25 AM
విశాఖ న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) నూతన అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది బెవర సత్యనారాయణ ఎన్నికయ్యారు.
విశాఖపట్నం-లీగల్, ఏప్రిల్ 5:
విశాఖ న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) నూతన అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది బెవర సత్యనారాయణ ఎన్నికయ్యారు. గురువారం ఎన్నిక నిర్వహించగా, ఫలితాలను శుక్రవారం రాత్రి ప్రకటించారు. అధ్యక్షునిగా సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థిపై 995 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అలాగే సంఘ ప్రధాన కార్యదర్శిగా డి.నరేష్కుమార్, సంయుక్త కార్యదర్శిగా అడపా సుధాకర్, కోశాధికారిగా అశోక్కుమార్ ఎన్నికయ్యారు. ఇంకా గ్రంథాలయ కార్యదర్శిగా కర్రి మాధవీలత, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా సింహాద్రియాదవ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా ఆడారి అప్పారావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి సంబంధించి రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ రావడంతో ఫలితం ప్రకటించలేదు. కాగా, న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, ఇతర న్యాయమూర్తులు అభినందించారు. ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సత్యనారాయణ మాట్లాడుతూ తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా పనిచేస్తామన్నారు.