Share News

సంయమనంతో ఉండండి

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:58 AM

తెలుగుదేశం క్రమశిక్షణగల పార్టీ అని, కార్యకర్తలు సంయమనం పాటించాలని నియోజకవర్గం ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ కోరారు. పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడం, అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ పేరు ప్రకటించడంతో పీలా గోవింద ఆదివారం ఉండవల్లి వెళ్లి చంద్రబాబునాయుడును కలిశారు.

సంయమనంతో ఉండండి
కార్యకర్తలతో మాట్లాడుతున్న పీలా గోవింద సత్యనారాయణ

టీడీపీ శ్రేణులకు పీలా గోవింద సూచన

అనకాపల్లి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం క్రమశిక్షణగల పార్టీ అని, కార్యకర్తలు సంయమనం పాటించాలని నియోజకవర్గం ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ కోరారు. పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడం, అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ పేరు ప్రకటించడంతో పీలా గోవింద ఆదివారం ఉండవల్లి వెళ్లి చంద్రబాబునాయుడును కలిశారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో పలువురు టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యానని, ఆయనతో జరిగిన చర్చల వివరాలను రెండు. మూడు రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. అనంతరం శ్రీకాకుళం పర్యటన ముగించుకుని విశాఖ విమానాశ్రయానికి రానున్న చంద్రబాబును కలిసేందుకు విశాఖపట్నం వెళ్లారు.

Updated Date - Feb 27 , 2024 | 12:58 AM