Share News

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:43 AM

మండలంలోని ఇరువాడ వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీని ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో డ్రైవర్‌ మృతి చెందాడు. సీఐ పిన్నింటి రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌
మృతిచెందిన ట్యాంకర్‌ డ్రైవర్‌ శ్రీనివాసరావు

డ్రైవర్‌ మృతి

సబ్బవరం, ఏప్రిల్‌ 18 : మండలంలోని ఇరువాడ వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీని ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో డ్రైవర్‌ మృతి చెందాడు. సీఐ పిన్నింటి రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్‌ ఇందరపాలెం గ్రామానికి చెందిన డైవర్‌ మసుమోను శ్రీనివాసరావు(44) కాకినాడ నుంచి బుధవారం ఆయిల్‌ ట్యాంకర్‌తో భువనేశ్వర్‌ వెళుతున్నాడు. మార్గమధ్యలో ఇరువాడ వద్ద జాతీయ రహదారిపై రెస్ట్‌ ఏరియా సమీపంలో ఆగి ఉన్న లారీ బలంగా ఢీకొట్టాడు. దీంతో ట్యాంకర్‌ కేబిన్‌ నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవర్‌ శ్రీనివాసరావు కేబిన్‌లో ఇరుక్కుపోయాడు. దీంతో అతని ఎడమ కాలు తొడభాగం విరిగిపోయింది. అతన్ని కేబిన్‌ నుంచి వెలికి తీసి చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడని సీఐ రమణ తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 12:43 AM