Share News

టీడీపీలో చేరిన అక్కరమాని దంపతులు

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:37 AM

విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ) మాజీ చైర్‌పర్సన్‌, తూర్పు నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్‌చార్జి అక్కరమాని విజయనిర్మల, ఆమె భర్త వెంకటరావు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీలో చేరిన అక్కరమాని దంపతులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ) మాజీ చైర్‌పర్సన్‌, తూర్పు నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్‌చార్జి అక్కరమాని విజయనిర్మల, ఆమె భర్త వెంకటరావు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి అధినేత నారా చంద్రబాబునాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అక్కరమాని విజయనిర్మల 2019 ఎన్నికల్లో తూర్పు అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత ఏడెనిమిది నెలల కిందట వరకూ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. విజయనిర్మల దంపతులతో పాటు పద్మనాభం మాజీ ఎంపీపీ గోపీ రాజు, విశాఖ జిల్లా చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు దుక్క కృష్ణాయాదవ్‌, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, మాజీ సర్పంచులు గేదెల చంద్రరావు, నమ్మి వెంకటరావు, జీవీఎంసీ 25వ వార్డు వైసీపీ అధ్యక్షుడు జి.సూర్యబాబు టీడీపీలో చేరారు.

Updated Date - Apr 19 , 2024 | 01:37 AM