Nellore : కారును ఆపి.. కత్తులతో నరికి..
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:29 AM
ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలు ముగించుకు ని బయల్దేరిన ఓ హిజ్రాను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

హిజ్రాల నాయకురాలి దారుణ హత్య
ఆస్పత్రికి తరలించేలోపు మృతి
నెల్లూరు జిల్లా కొడవలూరులో ఘోరం
కొడవలూరు, నెల్లూరు (క్రైం), నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలు ముగించుకు ని బయల్దేరిన ఓ హిజ్రాను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు హిజ్రాల నాయకురాలు కావడంతో ఈ ఘటన సంచలనం రేపింది. నెల్లూరులోని దీనదయాళ్నగర్కు చెందిన హాసిని కొన్ని రోజులుగా తిరుపతి శివారు మంగళం ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈమెకు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలమైన వర్గముంది. విడవలూరు మండలం పార్లపల్లి సమీపంలో మహాలక్ష్మమ్మ ఆలయ పునర్నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టి కొంతమేరకు పనులు చేయించిం ది. ఈ క్రమంలో మంగళవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.
ఆమెతోపాటు సహచర హిజ్రాలు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హాసిని కారులో నెల్లూరుకు బయలుదేరింది. టపాతోపు రైల్వే గేటు అండర్ బ్రిడ్జి వద్ద ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆమె కారును అడ్డుకున్నా రు. ఆమెను బలవంతంగా బయటకు లాగి మెడ, వీపు భాగంలో కత్తులతో నరికారు. అదే సమయంలో వెనుక ఆటోలో వస్తున్న హిజ్రాలను చూసి దుండగులు పరారయ్యారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన హాసినిని అంబులెన్స్లో నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపు మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హిజ్రాల ఆందోళన
హాసిని హత్యకు గురైన విషయం తెలుసుకున్న నెల్లూ రు, కడప, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాలతోపాటు తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో హిజ్రాలు బుధవారం నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావును కలిసి తమ నాయకురాలిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం జీజీహెచ్ మార్చురీలో హాసిని మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందని తెలుసుకొని అందరూ అక్కడ కు చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని అంబులెన్స్లో తిరుపతికి తరలించారు.