TDP: పోర్ట్బ్లెయిర్లో టీడీపీ ప్రచారం
ABN , Publish Date - Apr 12 , 2024 | 08:27 AM
కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోనూ టీడీపీ, బీజేపీ కూటమి ప్రచారం ఉధృతం చేసింది. తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న పోర్ట్బ్లెయిర్ ప్రాంతంలో బీజేపీ లోక్సభ అభ్యర్థి విష్ణుపాదరాయ్ గెలుపుకోసం అండమాన్ నికోబార్ టీడీపీ ఇన్చార్జ్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వీ మాధవ్నాయుడు ప్రచారం నిర్వహించారు.
![TDP: పోర్ట్బ్లెయిర్లో టీడీపీ ప్రచారం](https://media.andhrajyothy.com/media/2024/20240407/nani2_e144149237.jpg)
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోనూ టీడీపీ, బీజేపీ కూటమి ప్రచారం ఉధృతం చేసింది. తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న పోర్ట్బ్లెయిర్ ప్రాంతంలో బీజేపీ లోక్సభ అభ్యర్థి విష్ణుపాదరాయ్ గెలుపుకోసం అండమాన్ నికోబార్ టీడీపీ ఇన్చార్జ్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వీ మాధవ్నాయుడు ప్రచారం నిర్వహించారు. తెలుగు వారు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో టీడీపీ ఓట్లు కీలకం కావడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలసి గురువారం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో నడ్డాతో పాటు అండమాన్ బీజేపీ అధ్యక్షుడు అజయ్ భైరవి, బీజేపీ నేతలు మాణిక్యరావు పాల్గొన్నారు.