Share News

ఉత్తేజంతో పనిచేయాలి

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:12 AM

రానున్న ఎన్నిక ల్లో పార్టీ శ్రేణు లు ఉత్తేజంతో పనిచేయాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం జిల్లా పరిశీలకులు మీసాల సుబ్బన్న, డోల శ్రీనివాసరావు, గుత్తుల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

ఉత్తేజంతో పనిచేయాలి

- కాంగ్రెస్‌ పార్టీ జిల్లా పరిశీలకుల పిలుపు

అరసవల్లి: రానున్న ఎన్నిక ల్లో పార్టీ శ్రేణు లు ఉత్తేజంతో పనిచేయాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం జిల్లా పరిశీలకులు మీసాల సుబ్బన్న, డోల శ్రీనివాసరావు, గుత్తుల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సో మవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్‌ కమిటీ సభ్యుల, నాయకుల సమీక్షలో పాల్గొని మాట్లాడారు. పార్టీ విధానాన్ని ప్రజల్లో తీసుకువెళ్లాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వాల నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేయా లని కోరారు. డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో 30 మండలాలకు పార్టీ అధ్యక్షులతోపాటు బూత్‌ స్థాయి, పంచాయతీ స్థాయి అధ్యక్షుల ను నియమించామన్నారు. సమావేశంలో పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పైడి నాగభూషణరావు, అంబటి కృష్ణ, యువ జన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెల్ల సురేష్‌, జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కోత మధు సూధనరావు, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు శైలజ, టి.శాంతారావు, కె.వెంకటరావు, మంత్రి నర్సింహమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:12 AM