అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:44 PM
మెళియాపుట్టి మండల కేంద్రంలో గురజాడ ప్రభావతి (50) అనుమానా స్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ టి.రాజేష్ తెలిపారు.
మెళియాపుట్టి: మెళియాపుట్టి మండల కేంద్రంలో గురజాడ ప్రభావతి (50) అనుమానా స్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ టి.రాజేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మెళి యాపుట్టి శివారు ఇంటిలో ప్రభావతి ఉంటున్నారు. కుమారుడు సీఆర్పీఎఫ్లో పనిచేస్తున్నాడు. కుమారుడు గత నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తుండగా సమాధానం లేకపోవడంతో పక్క ఇంటి లో ఉన్న తన పెద్దమ్మకు ఫోన్ చేసి మా అమ్మకు ఫోన్ ఇవ్వాలని కోరా డు. అయితే శుక్ర వారం పెద్దమ్మ ఇంటిలోకి వెళ్లి చూడగా ప్రభా వతి శవమై పడి ఉన్నట్లు గుర్తించి సమాచారం ఇచ్చారు. దీంతో విశాఖపట్నంలో ఉన్న మరో కుమారుడికి సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఎస్ఐ రాజేష్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలిం చారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై మృతి చెంది ఉండ వచ్చని పలువురు అంటున్నారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గొంతు నొక్కి చంపి డబ్బులు, బంగారం తీసుకెళ్లి ఉండవచ్చని మరికొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఏం జరిగిం దో తెలియదు కాని ఇంటి లో మూడురోజుల కిందట చనిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.