శ్రీకాకుళంపై విజయనగరం జట్టు విజయం
ABN , Publish Date - Jun 06 , 2024 | 12:04 AM
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అండర్-19 నార్త్జోన్ క్రికెట్ పోటీలు చివరిరోజున శ్రీకాకుళం, విజయనగరం జట్ల మధ్య పోటీ జరిగింది.
![శ్రీకాకుళంపై విజయనగరం జట్టు విజయం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
టెక్కలి: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అండర్-19 నార్త్జోన్ క్రికెట్ పోటీలు చివరిరోజున శ్రీకాకుళం, విజయనగరం జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జట్ట్లు 35 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ జట్టులో రోహిత్ 64 పరుగులు సాధించగా విజయనగరం జట్టు బౌలర్ రాము నాలుగు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విజయనగరం జట్టు 37 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ జట్టులో దామోదర్ 52 పరుగులు చేయగా శ్రీకాకుళం బౌలర్లు జొన్నారావు నాలుగు వికెట్లు, వట్టికూళ్ల సన్నీ రెండు వికెట్లు తీశారు. ఈనెల 11 నుంచి నార్త్జోన్ అండర్-22 క్రికెట్ పోటీలు ఇదే మైదానంలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.