ద్విచక్ర వాహనం డిక్కీలోని రూ.5 లక్షలు చోరీ
ABN , Publish Date - May 27 , 2024 | 11:59 PM
ద్విచక్ర వాహనం డిక్కీలోని రూ.5 లక్షలు గుర్తితెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని సారవకోట మండలం చీడిపూడి గ్రామానికి చెందిన పొన్నాన ఝాన్సీ సోమవారం జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జలుమూరు: ద్విచక్ర వాహనం డిక్కీలోని రూ.5 లక్షలు గుర్తితెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని సారవకోట మండలం చీడిపూడి గ్రామానికి చెందిన పొన్నాన ఝాన్సీ సోమవారం జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఝాన్సీ చల్లవానిపేట స్టేట్బ్యాంకులో రూ.5 లక్షలు విత్డ్రా చేసి బ్యాగులో పెట్టి తన ద్విచక్రవాహనం డిక్కీలో పెట్టారు. పక్కనే ఉన్న షాప్నకు వెళ్లి కూల్డ్రింక్ తాగి తిరిగి బైక్పై ఇంటికి వచ్చి డిక్కీ చూసేసరికి నగదుతో ఉన్న బ్యాగు లేకపోవడంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. ఈ మేరకు ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. బ్యాంకు వద్ద, చల్లవానిపేట కూడలి వద్ద ఉన్న సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.