Share News

ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:22 AM

అరసవల్లి సమీపంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆటోఢీకొని గాయపడ్డారు.ట్రాఫిక్‌ ఎస్‌ఐ పి.ప్రసాదరావు కథనం మేర కు...చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన కంచి అనంత్‌ కొంతకాలంగా విశాఖలో ఓ టీదుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం కోటబొమ్మాళిలో స్నేహితుని వివా హానికి మరో స్నేహితుడు దున్న హేమంతరావుతో కలిసివెళ్లాడు. ఈక్రమంలో అరసవల్లి ఆలయాన్ని దర్శించుకుని శ్రీకూర్మం వెళ్లేందుకు ఆర్చి దాటుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో అనంత్‌, హేమంతరావులకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల సాయంతో 108లో వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలు

శ్రీకాకుళం క్రైమ్‌: అరసవల్లి సమీపంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆటోఢీకొని గాయపడ్డారు.ట్రాఫిక్‌ ఎస్‌ఐ పి.ప్రసాదరావు కథనం మేర కు...చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన కంచి అనంత్‌ కొంతకాలంగా విశాఖలో ఓ టీదుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం కోటబొమ్మాళిలో స్నేహితుని వివా హానికి మరో స్నేహితుడు దున్న హేమంతరావుతో కలిసివెళ్లాడు. ఈక్రమంలో అరసవల్లి ఆలయాన్ని దర్శించుకుని శ్రీకూర్మం వెళ్లేందుకు ఆర్చి దాటుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో అనంత్‌, హేమంతరావులకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల సాయంతో 108లో వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలికి...

రోడ్డుపై నడుచుకుని వెళ్తున్న ఓ వృద్ధురాలిని ద్విచక్రవాహనం ఢీకొనడంతో గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రసాదరావు కథనం మేరకు... శ్రీకాకుళంలోని మంగువారితోట సమీపంలోని కామాక్షమ్మ ఆలయం వద్ద నివసిస్తున్న దూపాన రమణ తల్లి జడ్పీ సమీపంలో నడుడుచుకుని వెళ్తోంది. అటుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు రమణకు సమాచారం ఇవ్వడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని తల్లిని రిమ్స్‌కు తరలించాడు. రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 12:22 AM