Share News

చెరువులో మునిగి ఇద్దరు మృతి

ABN , Publish Date - May 12 , 2024 | 11:54 PM

ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామ శివారులోని చెరువులో ప్రమాదవశా త్తు మునిగి అదే గ్రామా నికి చెందిన ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.

చెరువులో మునిగి ఇద్దరు మృతి

ఇచ్ఛాపురం, మే 12: ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామ శివారులోని చెరువులో ప్రమాదవశా త్తు మునిగి అదే గ్రామా నికి చెందిన ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలి పిన వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం ఉదయం సబితా రౌళో (48) స్నానం నిమిత్తం చెరువుకు వెళ్లింది. స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు ఓ గుంతలో చిక్కుకుంది. అది గమనించిన మరో వైపు స్నానం చేస్తున్న దూపాన బైరి (75) వెంటనే ఆమెను కాపాడేందుకు వెళ్లి ఆయన కూడా మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న స్థాని కులు అక్కడికి చేరుకుని ఇరువురిని బయటకు తీశారు. హుటాహుటిన ఇచ్ఛాఫురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతురాలు సబిత రౌళోకు భర్త రఘు నాథ్‌రౌళోతోపాటు ఇద్దరు కుమారులున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెంద డంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 12 , 2024 | 11:54 PM