Share News

ఉత్సాహంగా సంప్రదాయ క్రీడలు

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:06 AM

కిష్టప్పపేట గ్రామంలో సంప్రదాయ క్రీడలు ఉత్సాహంగా సాగాయి. శివరా త్రి పురష్కరించుకుని పార్వతీ సహిత కైలాశేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్త గొండు జగన్నాథరావు, గొండు శంకర్‌ ఆధ్వర్యంలో గురువారం ఈ క్రీడలు నిర్వహించారు.

ఉత్సాహంగా సంప్రదాయ క్రీడలు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌: కిష్టప్పపేట గ్రామంలో సంప్రదాయ క్రీడలు ఉత్సాహంగా సాగాయి. శివరా త్రి పురష్కరించుకుని పార్వతీ సహిత కైలాశేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్త గొండు జగన్నాథరావు, గొండు శంకర్‌ ఆధ్వర్యంలో గురువారం ఈ క్రీడలు నిర్వహించారు. తీతసంగిడి, ఉలవబస్తా, ఇరుసుగుండు పోటీల్లో సత్తాచాటిని గేదెల సత్యనారాయణ (ఒప్పంగి) ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచారు. పొందూరుకు చెందిన సయ్యిద్‌ రజాక్‌ (పొందూరు) తీతసంగిడి, ఉలవబస్తా పోటీల్లో ద్వితీయస్థానం, ఇసురుగుండు విభాగంలో ఆవల వసంత, రజాక్‌ సంయుక్తంగా ద్వితీయస్థానం నలిచారు. బంపర్స్‌ మహిళా విభాగంలో సీహెచ్‌ రాజ్యలక్ష్మి, హారికారాజు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. విజేతలకు అరసవల్లి శ్రీనివాసరావు, గుజ్జల హిమగిరి చేతులు మీదుగా నగదు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కన్సోలేషన్‌ నగదు బహుమతులతో సత్కరించారు. అరసవల్లి మోహనరావు, గుండ మురళి, ముద్దాడ సత్యనారాయణ, బాణ్ణ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:06 AM