మట్టి పెళ్లలు కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:13 AM
ఇసుకను అక్రమంగా తవ్వు తుండగా మట్టి పెళ్లలు కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం బిర్లంగి గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద జరిగింది.
ఇచ్ఛాఫురం: ఇసుకను అక్రమంగా తవ్వు తుండగా మట్టి పెళ్లలు కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం బిర్లంగి గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇసుకను తరలిం చేందుకు ట్రాక్టర్తో వచ్చిన జగదల్ పూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాసుదేవ్ పాత్రో (32) ఇసుకను తవ్వుతుండగా పైనుంచి మట్టి పెళ్లలు కూలడంతో వాటి కింద ఉండిపోయి ఊపిరాడక మృతి చెందాడు. విష యం తెలుసుకున్న సీఐ ఇమ్మాన్యుయేల్ రాజు, రూరల్ ఎస్ఐ లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడికి భార్య గాయత్రి మాత్రో, ముగ్గురు పిల్లలున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.