Share News

నేడు అమరుల సంస్మరణ సభ

ABN , Publish Date - May 26 , 2024 | 11:29 PM

బొడ్డపాడులో సోమవారం నిర్వహించనున్న అమరుల 34వ సంస్మరణ సభను విజయవంతంచేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ఆది వారం అమరవీరుల స్మారక మందిరంలో సంస్మరణ సభ నిర్వహణపై నేతలు సమావేశ మయ్యారు.

నేడు అమరుల సంస్మరణ సభ

పలాసరూరల్‌: బొడ్డపాడులో సోమవారం నిర్వహించనున్న అమరుల 34వ సంస్మరణ సభను విజయవంతంచేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ఆది వారం అమరవీరుల స్మారక మందిరంలో సంస్మరణ సభ నిర్వహణపై నేతలు సమావేశ మయ్యారు. దేశంలో నక్సల్బరీ తిరుగుబాటు ఉద్యమం ఒక ప్రధాన ఘట్టమని, దీనిలో అమరు లైన వీరుల సేవలను స్మరించి వారి త్యాగాలను మననం చేసుకునేందుకు ఈ సభను నిర్వహి స్తున్నామన్నారు. సమావేశంలో సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, దుష్యంత్‌, కామేశ్వరరావు, రామారావు, అప్పారావు, కైలాస్‌, బాలకృష్ణ, కుసుమ తదితరులు పాల్గొన్నారు.

బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు 34వ సంస్మరణ సభ నిర్వహిస్తు న్నట్లు సంఘం అధ్యక్షుడు జోగి కోదండరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులు, ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు.

Updated Date - May 26 , 2024 | 11:29 PM