Share News

నేడు పాలిసెట్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:45 PM

పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి శనివారం పాలిసెట్‌ నిర్వహించనున్నట్టు సమన్వయ కర్తలు గురుగుబెల్లి దామోదరరావు, ఎ.గోపి తెలిపారు.

నేడు పాలిసెట్‌

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 26: పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి శనివారం పాలిసెట్‌ నిర్వహించనున్నట్టు సమన్వయ కర్తలు గురుగుబెల్లి దామోదరరావు, ఎ.గోపి తెలిపారు. ‘జిల్లాలో 42 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తాం. శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలో 26 కేంద్రాల్లో 7,178 మంది, టెక్కలి డివిజన్‌ పరిధిలో 16 కేంద్రాల్లో 4,756 మంది.. మొత్తంగా 11,934 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు జరుగుతుంది. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాల’ని వారు సూచించారు.

Updated Date - Apr 26 , 2024 | 11:45 PM