Share News

కౌంటింగ్‌ ప్రక్రియపై నేడు డ్రై రన్‌

ABN , Publish Date - May 26 , 2024 | 11:41 PM

కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి సోమవారం డ్రై రన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ మన్‌జీర్‌ జలానీ సమూన్‌ తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులు, విధుల్లో పాల్గొనే వివిధ అధికారులతో ఆదివారం రాత్రి కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివిధ శాఖల సిబ్బంది నిర్వహించవలసిన ఏర్పాట్లకు సంబంధించి ఏయే తేదీల్లో పూర్తిచేసి సర్టిఫికెట్‌ అందజేయాలన్నది ఆదేశించారు. అదే విధంగా ఈ నెల 28న మైక్రో అబ్జర్వర్లతో, 29న ఈవీఎం కౌం టింగ్‌ అసిస్టెంట్లకు, 30న పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు, అసిస్టెం ట్లకు ట్రైనింగ్‌ ఉంటుందని తెలిపారు. జూన్‌ 3న మైక్రో అబ్జర్వర్లకు, కౌంటింగ్‌ సిబ్బందికి శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో శిక్షణ ఇస్తామన్నారు. అన్ని శిక్షణ కార్యక్రమాలకు ఏఆర్వోలు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

 కౌంటింగ్‌ ప్రక్రియపై నేడు డ్రై రన్‌

శ్రీకాకుళం, (ఆంధ్రజ్యోతి):కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి సోమవారం డ్రై రన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ మన్‌జీర్‌ జలానీ సమూన్‌ తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులు, విధుల్లో పాల్గొనే వివిధ అధికారులతో ఆదివారం రాత్రి కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివిధ శాఖల సిబ్బంది నిర్వహించవలసిన ఏర్పాట్లకు సంబంధించి ఏయే తేదీల్లో పూర్తిచేసి సర్టిఫికెట్‌ అందజేయాలన్నది ఆదేశించారు. అదే విధంగా ఈ నెల 28న మైక్రో అబ్జర్వర్లతో, 29న ఈవీఎం కౌం టింగ్‌ అసిస్టెంట్లకు, 30న పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు, అసిస్టెం ట్లకు ట్రైనింగ్‌ ఉంటుందని తెలిపారు. జూన్‌ 3న మైక్రో అబ్జర్వర్లకు, కౌంటింగ్‌ సిబ్బందికి శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో శిక్షణ ఇస్తామన్నారు. అన్ని శిక్షణ కార్యక్రమాలకు ఏఆర్వోలు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Updated Date - May 26 , 2024 | 11:41 PM