మూడు వాహనాలకే అనుమతి
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:02 AM
కేవలం అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే తహసీల్దార్ కార్యాలయం గేటు వరకు అనుమ తించాలని, ఇతరులను లోపలికి అనుమతించవద్దని ఎస్ఈబీ జేడీ, నామినేషన్ల ప్రక్రియ ఇన్చార్జి గంగాధరం తెలిపారు.
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 18: కేవలం అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే తహసీల్దార్ కార్యాలయం గేటు వరకు అనుమ తించాలని, ఇతరులను లోపలికి అనుమతించవద్దని ఎస్ఈబీ జేడీ, నామినేషన్ల ప్రక్రియ ఇన్చార్జి గంగాధరం తెలిపారు. గురువారం ఇచ్ఛాపురం బస్టాండ్ వద్ద కటాఫ్ పాయింట్లను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం గేటు వద్ద నుంచి నడిచి వెళ్లి నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ ఆదేశాల మేరకు కేవలం మూడు కార్లు, ఐదు గురుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, ర్యాలీలు, జనాలను 100 మీటర్లు దూరంలో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.