Share News

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:42 PM

దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని, 18 ఏళ్లు నిండి అర్హులైన దివ్యాంగులకు ఇళ్ల స్థలాలి వ్వాలని, బస్సుపాస్‌లున్న దివ్యాంగులకు అన్ని బస్సుల్లో ప్రయా ణానికి అవకాశం కల్పించాలని కోరుతూ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌కు వినతిపత్రం ఇస్తున్న దివ్యాంగులు

టెక్కలి: దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని, 18 ఏళ్లు నిండి అర్హులైన దివ్యాంగులకు ఇళ్ల స్థలాలి వ్వాలని, బస్సుపాస్‌లున్న దివ్యాంగులకు అన్ని బస్సుల్లో ప్రయా ణానికి అవకాశం కల్పించాలని కోరుతూ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఆ సంఘ అధ్య క్షుడు ఆవుల వేణుగోపాల్‌, మండల అధ్యక్షుడు పువ్వల చంద్ర శేఖర్‌, కార్యదర్శి బమ్మిడి మాధవరావు ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొని సమస్యలు పరిష్క రించాలని నినాదాలు చేశారు. సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్రమీనాలకు వినతిపత్రం అంద జేశారు. సీపీఎం నాయకుడు నంబూరు షణ్ముఖరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:42 PM