పోలింగ్ శాతం పెంచాలి
ABN , Publish Date - Apr 05 , 2024 | 12:09 AM
ఎన్నికల్లో పోలింగ్శాతం పెంచాలని బీఎల్వోలకు సబ్కలెక్టర్, టెక్కలి నియోజ కవర్గ రిటర్నింగ్ అధికారి నూరుల్కమర్ సూచించారు. గురువారం నర్శింగపల్లి, మొఖ లింగాపురం, గూడేంల్లో పోలింగ్కేంద్రాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు. బీఎల్వోలు, రమేష్, భారతి, సింహాచలం నుంచి గతఎన్నికల్లో ఎంతశాతం పోలింగ్, ఈ ప్రాంతం నుంచి ఓటర్ల వలసలను ఆరాతీశారు.గతఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరిగేలా చూడా ల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉందన్నారు. ప్రతి పోలింగ్కేంద్రానికి మరు గుదొడ్లు, తాగు నీటి, విద్యుత్ సౌకర్యం, స్విచ్బోర్డులు, ఫ్యాన్, ర్యాంపులు వంటివి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీరితో పాటు ఏఈఆర్వో మురళీకృష్ణ, సిబ్బంది ఉన్నారు.
![పోలింగ్ శాతం పెంచాలి](https://media.andhrajyothy.com/media/2024/20240326/4_Nandigam1_21f25452f3.gif)
టెక్కలి: ఎన్నికల్లో పోలింగ్శాతం పెంచాలని బీఎల్వోలకు సబ్కలెక్టర్, టెక్కలి నియోజ కవర్గ రిటర్నింగ్ అధికారి నూరుల్కమర్ సూచించారు. గురువారం నర్శింగపల్లి, మొఖ లింగాపురం, గూడేంల్లో పోలింగ్కేంద్రాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు. బీఎల్వోలు, రమేష్, భారతి, సింహాచలం నుంచి గతఎన్నికల్లో ఎంతశాతం పోలింగ్, ఈ ప్రాంతం నుంచి ఓటర్ల వలసలను ఆరాతీశారు.గతఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరిగేలా చూడా ల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉందన్నారు. ప్రతి పోలింగ్కేంద్రానికి మరు గుదొడ్లు, తాగు నీటి, విద్యుత్ సౌకర్యం, స్విచ్బోర్డులు, ఫ్యాన్, ర్యాంపులు వంటివి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీరితో పాటు ఏఈఆర్వో మురళీకృష్ణ, సిబ్బంది ఉన్నారు.
ఫనందిగాం: మండలంలోని పెద్దతామరాపల్లి, కోమటూరు, పోతులూరు, చిన్నతామ రాపల్లి, కర్లపూడి, నౌగాం,రధజనబొడ్డపాడు, గొల్లూరు, బెల్లుకోల, చిన్నారిగోకర్లపల్లి, రాంపు రం తదితర పోలింగ్ కేంద్రాలను టెక్కలి సబ్కలెక్టర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నూరుల్కమర్ పరిశీలించారు. ఆయాకేంద్రాల్లో ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలపై పరిశీ లించి, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఓటర్లకు అన్నిరకాల వసతులు అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులకు, బీఎల్వోలకు సూచించారు. కార్య క్రమంలో ఎంసీసీ అధికారి జి.శివప్రసాద్, తహసీల్దార్ వి.పద్మావతి, డీఎల్పీవో ఐవీ రమణ, మండల సర్వేయర్ కె.జోగారావు, ఆర్ఐ కిరణ్, సెక్టార్ అధికారులు, బీఎల్వోలు పాల్గొన్నారు.