కొనసాగుతున్న బెంతు ఒరియాల నిరసన
ABN , Publish Date - Mar 18 , 2024 | 11:49 PM
బెంతు ఒరియాలు కవిటిలో చేపట్టిన నిరసన దీక్ష సోమవారం 82వ రోజుకు చేరుకుంది.
![కొనసాగుతున్న బెంతు ఒరియాల నిరసన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కవిటి: బెంతు ఒరియాలు కవిటిలో చేపట్టిన నిరసన దీక్ష సోమవారం 82వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వాలు మారుతు న్నా మా బతుకులకు గుర్తింపు లభించడం లేదని ఆ సంఘ నాయకులు సుమన్ బిసాయి, రజనీకుమార్ దొళాయి, శ్రీకాంతపురియా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కుల గుర్తింపుకోసం నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ సం క్షేమ పథకాలు అందక దీనస్థితిలో ఉండి, విద్యార్ధులకు చదువులు కొనసాగకుండా మా బతుకులు ఉన్నాయన్నారు.