సిరా గుర్తు 72 గంటలపాటు చెరిగిపోదు
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:17 PM
: ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఓటరు చూపుడు వేలిపై సిరా చుక్కను గుర్తుగా పెడతారు. దీంతో సదరు ఓటరు మళ్లీ ఓటు వేయడానికి వీలుండదు. దొంగ ఓట్ల కట్టడికి ఎన్నికల కమిషన్ ఈ నిబంధన తొలినాళ్లలోనే రూపొందించింది. ఈ సిరాగుర్తు 72 గంటల పాటు చెరిగిపోకుండా ఉంటుంది. మైసూరుకు చెందిన మైసూరు పెయింట్స్ అండ్ వార్నీష్ పరిశ్రమ తయారుచేసిన ఇంకును ఈసీ 1962 నుంచి ఉపయోగిస్తోంది. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్, నైట్రేట్ కలపడం వల్ల అంత తొందరగా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు.
గార: ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఓటరు చూపుడు వేలిపై సిరా చుక్కను గుర్తుగా పెడతారు. దీంతో సదరు ఓటరు మళ్లీ ఓటు వేయడానికి వీలుండదు. దొంగ ఓట్ల కట్టడికి ఎన్నికల కమిషన్ ఈ నిబంధన తొలినాళ్లలోనే రూపొందించింది. ఈ సిరాగుర్తు 72 గంటల పాటు చెరిగిపోకుండా ఉంటుంది. మైసూరుకు చెందిన మైసూరు పెయింట్స్ అండ్ వార్నీష్ పరిశ్రమ తయారుచేసిన ఇంకును ఈసీ 1962 నుంచి ఉపయోగిస్తోంది. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్, నైట్రేట్ కలపడం వల్ల అంత తొందరగా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు.