కూటమి విజయమే లక్ష్యం
ABN , Publish Date - Mar 26 , 2024 | 12:11 AM
‘ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయమే లక్ష్యంగా సమష్టిగా పని చేద్దాం. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడుదాం’ అని కూటమి నాయకులు పిలుపునిచ్చారు.
-సమష్టిగా కృషి చేద్దాం
- వైసీపీ పాలనకు చరమగీతం పాడుదాం
- సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల పిలుపు
అరసవల్లి, మార్చి 25: ‘ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయమే లక్ష్యంగా సమష్టిగా పని చేద్దాం. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడుదాం’ అని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని కొత్తరోడ్డు వద్ద ఓ ఫంక్షన్ హాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, తదితరులు మాట్లాడుతూ.. జిల్లా, పార్లమెంటరీ, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూటమికి సంబంధించి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. తదనుగుణంగా సమావేశాలు నిర్వహించి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. వైసీపీ రహిత రాష్ట్రమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని, నేటి నుంచే ప్రచారం ప్రారంభించాలని అన్నారు. జెండాలు వేరైనా అందరి అజెండా మాత్రం ఒకటేనని, అది పూర్తి విజయం సాధించడమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి.ఉమామహేశ్వరరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, నాయకులు పూడి తిరుపతిరావు, శవ్వాన ఉమామహేశ్వరి, పేడాడ రామ్మోహనరావు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.