Share News

బాబుతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:52 PM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సీఎంగా చేయడం వల్ల రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం జిల్లాలో బాబు ష్యూరిటీ - భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి వెళ్లి వైసీపీ అరాచకాలు, చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించి, కరపత్రాలు పంపిణీచేశారు.

బాబుతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు
పాతపట్నం: పెద్దమల్లిపురంలో బాబు ష్యూరిటీ-బాబు గ్యారెంటీ కార్యక్రమం కరపత్రాలు అందజేస్తున్న కలమట సాగర్‌ :

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సీఎంగా చేయడం వల్ల రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం జిల్లాలో బాబు ష్యూరిటీ - భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి వెళ్లి వైసీపీ అరాచకాలు, చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించి, కరపత్రాలు పంపిణీచేశారు.

ఫ నరసన్నపేట: వైసీపీ పాలనలో పేదలకు దగా చేశారని టీడీపీ పట్టణాధ్యక్షుడు కింజరాపు రామారావు ఆరోపించారు. నరసన్నపేటలోని బొడ్డ వలసలో బాబుష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీకార్యక్రమం నిర్వహించారు. కార్య క్ర మంలో గొద్దు చిట్టిబాబు, రావాడ గణపతి, కూన రమేష్‌ పాల్గొన్నారు.

ఫజలుమూరు (సారవకోట): యువత భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని సారవకోట మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ తెలిపారు. సారవకోట మండలంలోని రామచంద్రాపురంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌చార్జి సాధు చిన్నికృష్ణంనాయుడు, మాజీ సర్పంచ్‌ బోర తాతయ్య, టిడిపి నాయకులు కె.అప్పారావు, దండుపాటి రాజారావు పాల్గొన్నారు.

ఫపాతపట్నం: రాష్ట్రంలో కక్షసాధింపులు, పదవీపరిరక్షణే లక్ష్యంగా వైసీపీ పాలన సాగిందని టీడీపీ రాష్ట్రకార్యదర్శి కలమట సాగర్‌ ఆరోపించా రు. మండలంలోని పెద్దమల్లిపురంలో బాబుష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్రఉపాధ్య క్షుడు పైల లక్ష్మయ్య, మాజీసర్పంచ్‌ గొర్లె ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

ఫ పొందూరు:పొందూరులో టీడీపీ నేతలు బాబు ష్యూరిటీ- భవి ష్య త్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. వాండ్రంగివీధిలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ మం డలాధ్యక్షుడు రామ్మోహన్‌, నాయకులు అన్నెపురాము, శంకర భాస్కర్‌, కె.శ్రీ నివా సరావు, కె.శాంతారాం, పాపారావు, ఎస్‌.రమణ తదితరులు పాల్గొన్నారు.

ఫ ఇచ్ఛాపురం: పురపాలక సంఘ పరిధి 11వ వార్డు కస్పావీధిలో కౌన్సిలర్‌ ఆశి లీలారాణి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం వార్డులో ఇంటింటికీ వెళ్లి కరప త్రాలు పంపిణీ చేశారు.

ఫ ఆమదాలవలస: టీడీపీతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం సాధ్యమని ఆ పార్టీ బీసీ సెల్‌ కార్యదర్శి బోర గోవిందరావు అన్నారు. సోమవారం ఆమ దాలవలస మున్సిపాలిటీలోని 10, 49, 50 వార్డుల్లో బాబు ష్యూరిటీ భవి ష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందరంగా టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాడ విజయ్‌కుమార్‌, నాగళ్ల మురళీధర్‌, జి.సింహాద్రి, జి.కరుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:52 PM