నిందితులను శిక్షించాలి
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:33 AM
తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన వారిని శిక్షించాలని ఎచ్చెర్ల వైస్ ఎంపీపీ, వైసీపీ నేత జరుగుళ్ల శంకరరావు భార్య విజయకుమారి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరింది. శంకరరావుపై దాడి జరిగి మూడు రోజులవుతున్నా కేసులో ఎటువంటి పురోగతి లేదు.
![నిందితులను శిక్షించాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/PSR_9761_fbdf6872f5.gif)
- శంకరరావుపై దాడికి నిరసనగా భారీ ర్యాలీ
- న్యాయం చేయాలంటూ ఏఎస్పీకి వినతిపత్రం
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 12: తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన వారిని శిక్షించాలని ఎచ్చెర్ల వైస్ ఎంపీపీ, వైసీపీ నేత జరుగుళ్ల శంకరరావు భార్య విజయకుమారి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరింది. శంకరరావుపై దాడి జరిగి మూడు రోజులవుతున్నా కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీకాకుళంలో సోమవారం భారీ ర్యాలీ చేశారు. ఏడురోడ్ల కూడలి నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. శంకరరావుకు న్యాయం చేయాలని, నిందితులను పట్టుకుని శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ మేరకు ఏఎస్పీ డి.ప్రేమ్కాజల్కు శంకరరావు భార్య విజయకుమారి వినతిపత్రాన్ని అందజేశారు. తన భర్తను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, ఎంపీపీ మొదలవలస చిరంజీవులు వేధింపులకు గురిచేశారని తెలిపారు. హత్యాయత్నానికి కూడా పూనుకోవడం తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని, న్యాయం చేస్తామని ఏఎస్పీ భరోసా ఇచ్చారు.