తెలగలను బీసీ జాబితాలో చేర్చాలి
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:53 PM
తెలగ కులస్థులను బీసీ జాబితాలో చేర్చాలని ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమ శాఖ అధ్యక్షుడు పల్లంట్ల వెంకట రామారావు కోరారు. మంగళవారం హరిపురంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చాపురం నుం చి పాయకరావుపేట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పా రు.
![తెలగలను బీసీ జాబితాలో చేర్చాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హరిపురం: తెలగ కులస్థులను బీసీ జాబితాలో చేర్చాలని ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమ శాఖ అధ్యక్షుడు పల్లంట్ల వెంకట రామారావు కోరారు. మంగళవారం హరిపురంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చాపురం నుం చి పాయకరావుపేట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. తమ హక్కుల సాధనకు మద్దతు తెలియజేసే పార్టీలకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా తెలగసంఘ అధ్యక్షుడు ఇనుముల జనార్దన, త్రిపురాన రాజేంద్రదాస్, బైరిశెట్టి గున్నయ్య, శ్రీనివాసరావు, పుల్లావాసు, బల్ల లీలారాణి, మట్ట ఖగేశ్వరరావు పాల్గొన్నారు.