Share News

చిన్నారికి ఉపాధ్యాయుల సాయం

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:33 PM

రాళ్లపాడు పంచాయితీ ముప్పిడి ప్రాఽథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న గంగుపల్లవిశ్రీ కంటికి వ్యాధి సోకడంతో వైద్యులు ఆ కన్ను తొలగించారు.

చిన్నారికి ఉపాధ్యాయుల సాయం
: పల్లవిశ్రీకి నగదు అందజేస్తున్న ఎంఈవో

ముప్పిడి(పోలాకి): రాళ్లపాడు పంచాయితీ ముప్పిడి ప్రాఽథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న గంగుపల్లవిశ్రీ కంటికి వ్యాధి సోకడంతో వైద్యులు ఆ కన్ను తొలగించారు. దీంతో నిరుపేద బాలికకు తమ వంతు సాయంగా ఉపాధ్యా యులంతా విరాళాలు పోగుచేసి రూ.95,500 నగదును గురువారం సాయంత్రం అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు ఎంఈఓ టి.లింగరాజు, మాజీ సర్పంచ్‌ చిట్టిపావనీ సింహాచలం బాలిక తల్లిదండ్రులకు నగదును అందజేశారు. బాలికకు ఉన్నత వైద్యచికిత్సతో పాటు, చదువు కొనసాగించడానికి తమ వంతు సహకారం అందిస్తామని ఉపాధ్యాయులు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బోర సోమేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చింతాడ దిలీప్‌కు మార్‌, ధర్మారావు, నరసింహులు, రాజేష్‌, టి.సుజాత, కామేశ్వరి, సునీల్‌గౌతమ్‌, రామశంకర్‌, హెచ్‌ఎం బి.శ్యామలరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:33 PM