సాగరతీరంలో టీడీపీ ఎన్నికల శంఖారావం
ABN , Publish Date - Feb 15 , 2024 | 11:27 PM
సాగరతీర ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల శంఖారావం పూరించారు.
కొత్తరేవు (పోలాకి): సాగరతీర ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల శంఖారావం పూరించారు. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తన అనుచరులతో మత్స్యకారులను కలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటీకీ వెళ్లి వివరించారు. టీడీపీ మేనిఫెస్టోను ఓటర్లకు తెలియజేశారు. ఆయన వెంట జనసేన పార్టీ ఇన్చార్జి బలగ ప్రవీణ్ కుమార్, ఎం.వి.నాయుడు, బైరి భాస్కరరావు, దుష్యంత్, బగ్గు అర్చన, అర్జాల విష్ణు, రాజేశ్వరి, డోల ప్రసాదరావు, వై.లక్ష్మణరావు, కోరాడ నాగరాజు, చిట్టి సింహాచలం, మైలపల్లి త్రినాఽథ్, మత్స్యకార సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
చంద్రబాబునాయుడుతో రాష్ట్రానికి వెలుగులు
జలుమూరు: వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి జాడలు కనిపిస్తాయని టీడీపీ మండల పార్టీ నాయకులు వెలమల రాజేంద్రనాయుడు, కత్తిరి వెంకటరమణ అన్నారు. గురువారం జలుమూరు, సారవకోట మండలాల్లో బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ సిక్స్ కార్యక్రమాల బ్రోచర్ను ఇంటింటికీ పంపిణీ చేశారు. సైకిల్కు ఓటు వేసి నిరంకుశ పాలనను అంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బగ్గు సునీల్, గోవింద రావు, దుంగ స్వామిబాబు, పంచిరెడ్డి రామచంద్రరావు, సురవరపు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.