టీడీపీ విజయోత్సవాలు
ABN , Publish Date - Jun 08 , 2024 | 11:40 PM
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు శనివారం విజయోత్సవాలు నిర్వహించారు. బాణసంచా కాల్చడంతో పాటు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కేక్లు కట్ చేసి పంచిపెట్టారు.
![టీడీపీ విజయోత్సవాలు](https://media.andhrajyothy.com/media/2024/20240604/8_Ptnm_4a_801875c435.gif)
పాతపట్నం: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు శనివారం విజయోత్సవాలు నిర్వహించారు. బాణసంచా కాల్చడంతో పాటు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కేక్లు కట్ చేసి పంచిపెట్టారు. పాతపట్నం దుర్గమ్మ గుడి కాలనీలో పాత పట్నం ఎమ్మెల్యేగా మామిడి గోవిందరావు గెలుపొందిన నేపథ్యంలో శనివారం విజయోత్సవాలు నిర్వహించారు. వీధి కూడలిలో కేక్ కట్చేసి పంచి పెట్టారు. సుదీర్ఘ కాలం తరువాత నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందిన నేపథ్యంలో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. బాణ సంచాలను కాల్చి సంబరాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పైల బాబ్జీ, సైలాడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అంబరాన సంబరాలు
సంతబొమ్మాళి: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీ సాధిం చడంతో పాటు టెక్కలి ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మో హన్ నాయుడు అత్యధిక మెజార్టీతో ఎన్నిక కావడంతో గ్రామాల్లో సంబ రాలు అంబరాన్ని అంటుతున్నాయి. శనివారం బోరుభద్ర, మేఘవరం గ్రామాల్లో ఎర్రన్నాయుడు విగ్రహాలకు పాలభిషేకం చేసి, బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి.
ర్యాలీతో హోరెత్తిన దిమిలాడ
నందిగాం: దిమిలాడలో శనివారం విజయోత్సవాలు నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించడంపై ఆనం దం వ్యక్తం చేస్తూ గ్రామంలో బాణాసంచా కాలుస్తూ ఆటపాటలతో సందడి చేశారు. వీధుల్లో ర్యాలీ చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. డిక్కల కిషోర్, నడుపూరు వైకుంఠరావు తదితరుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేతలు మళ్ల బాలకృష్ణ, జీరు నానీరెడ్డి, కూరాకుల యాదవ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ-జనసేన విజయోత్సవ ర్యాలీ
ఇచ్ఛాపురం: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి బెందాళం అశోక్ అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ సాధించడంతో కూటమి నాయకులు విజ యోత్సవ ర్యాలీ నిర్వహించారు. శనివారం బూర్జుపాడు, డొంకూరు, పెద్ద లక్ష్మీపురం, చిన్నలక్ష్మీపురం గ్రామాల్లో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి దాసరి రాజు, దున్న లోకనాథం, గణపతి, శ్రీను, రామారావు, మోహన్రావు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
మిఠాయిల పంపిణీ
ఆమదాలవలస: మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో టీడీపీ విజయోత్సవ సంబరాలు సందర్భంగా ఇంటింటికి మిఠాయిలు పంపిణీ ఆ పార్టీ శ్రేణులు కొనసాగిస్తున్నారు. 12, 13, 14, 15, 16 వార్డుల్లో శని వారం టీడీపీ నాయకులు బోయిన బాలసునీత, తమ్మినేని గీతా విద్యా సాగర్, కూన రాము, ప్రసాద్ ఆఽధ్వర్యంలో పంపిణీచేస్తూ కూటమి అభ్యర్థి కూన రవికుమార్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.