దుర్మార్గుడితో పోరాటంలో టీడీపీది పైచేయి కావాలి: అచ్చెన్న
ABN , Publish Date - May 03 , 2024 | 11:33 PM
సీఎం జగన్రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఓ దుర్మార్గుడని, ఆ దుర్మార్గుడితో జరుగు తున్న ఈ ఎన్నికల పోరాటంలో టీడీపీది పైచేయి కావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం నిమ్మాడలో టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండ లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
టెక్కలి: సీఎం జగన్రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఓ దుర్మార్గుడని, ఆ దుర్మార్గుడితో జరుగు తున్న ఈ ఎన్నికల పోరాటంలో టీడీపీది పైచేయి కావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం నిమ్మాడలో టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండ లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల పాటు అనేక కష్టాలు అనుభ వించాం.. ఒక్క వారం రోజులు గట్టిగా కష్టపడితే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవచ్చన్నారు. శనివారం నుంచి టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే పోస్టల్ బ్యాలెట్పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం పలువురు కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వారం రోజుల పాటు కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీలో చేరిక
విశాఖ మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ సీనియర్ నాయకుడు దాడి సత్యనారాయణ శుక్రవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నా యుడు ఆయనకు కండువా వేసి ఆహ్వానించారు. ఆయ నతో పాటు విశాఖ తూర్పు నియోజక వర్గానికి చెందిన డాక్టర్ కంచికర్ల అచ్చుతరావు, పారిపల్లి రామారావు, జాతీయ మానవహక్కుల పరిర క్షణ సంస్థ ప్రతినిధి జనార్దన్, రవికుమార్, భగవాన్, గౌడుమణి బాలకృష్ణ తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి ప్రజలపై పన్నుల భారం మోపిందని, సంపద సృష్టించడం, అది ప్రజలకు పంచడం టీడీపీతోనే సాధ్యమని, అందుకే తామంతా టీడీపీలో చేరుతున్నామని సత్యనారాయణ తెలిపారు. నంది గాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి మండలాల పరిధి కోటపాడు, కురుడు, శివరాంపురం, హర్షబాడ, దిమ్మిడిజోల, ఇజ్జువరం, నౌగాం, బన్ను వాడ గ్రామాల నుంచి వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి అచ్చె న్నాయుడు కండువాలు కప్పి ఆహ్వానం పలికారు.
నందిగాం: రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని గెలి పించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని శివరాం పురం, సైలాడ, వల్లభ రాయుడుపేట, నరేంద్రపురం పంచాయతీల్లో ప్రచారం చేపట్టారు. ఎమ్మె ల్యేగా తనను, ఎంపీగా రామ్మో హన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నేతలు పి.అజయ్ కుమార్, పి.చంద్రశేఖర్, ఎం.బాలకృష్ణ, ఎస్.జానకిరాం, ఎ.సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.