బీఆర్ఏయూ రిజిస్ట్రార్గా సుజాత
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:01 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పీలా సుజాత, రెక్టార్గా బిడ్డిక అడ్డయ్య నియమితుల య్యారు.
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పీలా సుజాత, రెక్టార్గా బిడ్డిక అడ్డయ్య నియమితుల య్యారు. ఈ మేరకు సోమవారం వీరికి వీసీ కేఆర్ రజని తన చాంబర్లో నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు రిజిస్ట్రార్గా పనిచేసి.. ప్రస్తుతం రెక్టార్గా నియమి తులైన అడ్డయ్య 1994లో అర్ధశాస్త్రం విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్గా కెరీర్ ప్రారం భించారు. 2012లో ప్రొఫెసర్గా పదోన్నతి పొంది, అనంతరం వర్సిటీ పాలకమండలి సభ్యునిగా, పలు కమిటీల్లో సభ్యునిగా, చీఫ్ ఎగ్జామినర్గా, అడకమిక్ ఎఫైర్స్ డీన్గా, ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించారు. రిజిస్ట్రార్గా నియమితులైన పీలా సుజాత 2010లో బీఆర్ఏయూలో బయోటెక్నాలజీ విభాగంలో అధ్యాపకుకాలిగా కెరీర్ను ప్రారంభించారు. 2022లో ఉత్తమ పరిశోధకురాలి అవార్డు (స్నాతకోత్సవం)ను బీఆర్ఏయూ నుంచి అందుకున్నారు. వర్సిటీ పాలకమండలి సభ్యురాలిగా, ఐక్యూఏసీ, నాక్ సమన్వయకర్తగా, సీడీసీ డీన్గా, స్పోర్ట్స్ విభాగం డీన్గా, ఇంజనీరింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. కాగా, రెక్టార్గా అడ్డయ్య, రిజిస్ట్రార్గా సుజాత నియామకంపై వర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.