గుర్తుతెలియని యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - May 24 , 2024 | 11:47 PM
వెంకటాపురం గ్రామ సమీపంలో గల జీడితోటలో గుర్తుతెలియని యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్ఐ సీహెచ్ రామా రావు చెప్పారు.
![గుర్తుతెలియని యువకుడి ఆత్మహత్య](https://media.andhrajyothy.com/media/2024/20240511/24vkp04_db803c34f8.gif)
వజ్రపుకొత్తూరు: వెంకటాపురం గ్రామ సమీపంలో గల జీడితోటలో గుర్తుతెలియని యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్ఐ సీహెచ్ రామా రావు చెప్పారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగి ఉం టుందని చెప్పారు. ఎస్ఐ అందించిన వివరాలు మేరకు.. మృతుడు తెల్లటిచారల టీ-షర్టు, నిక్కరు వేసుకొని ఉన్నాడు. అతని పాకెట్లో లభించిన ఐడీ కార్డు ప్రకారం అతడి పేరు గొర్లె ఉమామహేశ్వరరావు (26)గా ఉంది. అలాగే నావల్ డాక్యార్డ్లో పనిచేస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినవాడిగా ఉండొచ్చని స్థానికులు అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. ఇతడి వివరాలు తెలిసినవారు వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.