సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:52 PM
తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని అంగన్వా డీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ స్పష్టంచేసింది. గురువారం సమ్మె 38వ రోజుకు చేరగా వివిద రూపాల్లో నిరసనలు కొనసాగించారు. కాగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వం ఇటీవల కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం విదితమే. ఈనేపథ్యంలో గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు.అనంతరం షోకాజ్ నోటీ సులకు వివరణ పత్రాలను అధికారులకు అంగన్వాడీ కార్యకర్తలు అందజే శారు. ఈసందర్భంగా సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూ నియన్ నాయకులు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీనే అమలుచేయాలని కోరుతుండగా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం విచారకరమని పేర్కొ న్నారు. ఎఫ్ఆర్ఎస్ రద్దుచేసి అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా మార్చా లని, సర్వీసులో చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని అంగన్వా డీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ స్పష్టంచేసింది. గురువారం సమ్మె 38వ రోజుకు చేరగా వివిద రూపాల్లో నిరసనలు కొనసాగించారు. కాగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వం ఇటీవల కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం విదితమే. ఈనేపథ్యంలో గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు.అనంతరం షోకాజ్ నోటీ సులకు వివరణ పత్రాలను అధికారులకు అంగన్వాడీ కార్యకర్తలు అందజే శారు. ఈసందర్భంగా సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూ నియన్ నాయకులు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీనే అమలుచేయాలని కోరుతుండగా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం విచారకరమని పేర్కొ న్నారు. ఎఫ్ఆర్ఎస్ రద్దుచేసి అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా మార్చా లని, సర్వీసులో చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
(ఆంధ్రజ్యోతి బృందం)