నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:34 PM
టీడీపీ హయాంలో గతంలో బీఆర్ ఏయూకు మంజూరైన నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని వర్సిటీ అధికారులు కోరారు. ఈ మేరకు సోమవారం నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని, రెక్టార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిశారు.
ఎచ్చెర్ల, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):టీడీపీ హయాంలో గతంలో బీఆర్ ఏయూకు మంజూరైన నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని వర్సిటీ అధికారులు కోరారు. ఈ మేరకు సోమవారం నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని, రెక్టార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిశారు. వర్సిటీలో రూ.38 కోట్ల అంచనా వ్యయంతో సీపీడబ్ల్యూ ఇంజనీర్ల పర్యవేక్షణలో నిర్మించిన పరిపాలనా భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. 2020లో ప్రకటించిన రూ.15 కోట్ల అడ్వాన్స్ నిధులు కూడా ఇప్పటికీ విడుదల కాలేదని మంత్రికి వివరించారు.