Share News

టీడీపీ-జనసేనతో రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:05 AM

టీడీపీ, జనసేనతో రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుం దని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు.

టీడీపీ-జనసేనతో రాష్ట్రాభివృద్ధి
సంతబొమ్మాళి: ఇజ్జువరంలో పథకాలపై అవగాహన కల్పిస్తున్న నాయకులు

లావేరు: టీడీపీ, జనసేనతో రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుం దని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు. సోమవారం వేణుగోపాలపురం, నాగంపాలెం గ్రామాల్లో బాబు ష్యురిటీ - భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలకు సంబంధించి ఇంటింటా ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, విజయనగరం పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి లంక నారాయణ రావు, మాజీ జడ్పీటీసీ పిన్నింటి మధుబాబు, పార్టీ నాయ కులు మజ్జి రామ్మూర్తి నాయుడు, దుర్గాశి రాంబాబు, సుత్తి సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

రానున్న ఎన్నికల్లో టీడీపీదే విజయం

సంతబొమ్మాళి: రానున్న ఎన్నికల్లో టీడీపీదే విజయమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు జీరు భీమారావు అన్నారు. సోమ వారం ఇజ్జువరంలో ఇంటింటికీ వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. మాజీ సర్పంచ్‌ బొడ్డేపల్లి సత్యనారాయణ, మండల తెలుగు యువత అధ్యక్షుడు కూశెట్టి భానుప్రకాష్‌, ఐటీడీపీ అధ్యక్షుడు బెండి అరుణ్‌కు మార్‌, మెండ రామినాయుడు, సువ్వారి ప్రసాద్‌ పాల్గొన్నారు.

టీడీపీ విజయానికి కృషి చేయాలి

కొత్తూరు: రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ అన్నారు. మెట్టూరు సెంటర్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటిం చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీకి పట్టం కట్టండి

టెక్కలి: రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావు అన్నారు. సోమ వారం మేఘవరం పంచాయతీ సరియాపల్లి, డెప్పూరు, పెద్ద భీంపురం, కోదండపురం గ్రామాల్లో సూపర్‌సిక్స్‌, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

బుడితిలో..

జలుమూరు (సారవకోట): టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. బుడితి జనా వీధిలో సోమవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఎర్ర రమణమ్మ, నాయకులు ముద్ద భీమారావు, పిచ్చిక సూరి, చల్ల ఆనందరావు, జయరాం పాల్గొన్నారు.

వైసీపీ అరాచకాలకు అడ్డుకట్టు వేయాలి

నరసన్నపేట: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్టు వేసేందుకు ప్రతీ ఒక్కరు నడుంబిగించాలని తెలుగు యువత నాయకుడు సీతా రాం, మాజీ ఎంపీటీసీ పీస కృష్ణ అన్నారు. సోమవారం జగన్నాథపురం, బండి వీధుల్లో సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. అలాగే దుద్దిపేట, జగన్నాథపురం గ్రామాల్లో శంఖారావం నిర్వ హించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అడపా చంద్రశేఖర్‌, రామరాజు, రాజు, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

పొందూరులో బాబు ష్యూరిటీ..

పొందూరు: మేజరు పంచాయతీ పొందూరు పట్టణంలో సోమవారం బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో పార్టీ నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:05 AM