Share News

లక్ష్మీదేవికే శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలి

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:22 AM

శ్రీకాకుళం నియోజకవర్గ అసెంబ్లీ టికెట్‌ బీజేపీకి కేటాయిస్తున్నారన్న వార్తలపై నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

లక్ష్మీదేవికే శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలి
కన్నీటి పర్యాంతమవుతున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, ఎంపీ ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు

ఆంధ్రజ్యోతి- శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గ అసెంబ్లీ టికెట్‌ బీజేపీకి కేటాయిస్తున్నారన్న వార్తలపై నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నియోజకవర్గంలో దశాబ్ధాల తరబడి గుండ దంపతులకే టీడీపీ టికెట్‌ ఇస్తుండగా.. ఈ సారి పొత్తుల నేపథ్యంలో బీజేపీకే ఇస్తే ఎలా అంటూ నియోజకవర్గ కార్యకర్త లు శుక్రవారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రా మ్మోహన్‌ ఇంటి ముందర టీడీపీ శ్రేణులు చేరి నిరసన తెలిపారు. ఎంపీ అందు బాటులో లేకపోవడంతో.. ఫోన్‌లో మాట్లాడి విషయాన్ని తెలియజేశారు. తాను చంద్రబాబుతో మాట్లాడతానని హామీఇచ్చారు. అనంతరం టీడీపీ శ్రేణులు గుండ దంపతుల ఇంటి వద్దకు చేరుకున్నారు. లక్ష్మీదేవికే టికెట్‌ కేటాయించాలంటూ కా ర్యకర్తలు హడావిడి చేశారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లా డుతూ.. తాము ఎప్పటికీ చంద్రబాబుకి విధేయులమేనని.. తమకు చంద్రబాబు మాటే శిరోధార్యమని తెలిపారు. ఈ సందర్భంగా గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. కార్యకర్తలకు నచ్చజెప్పుతూ తాను కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ నగర అధ్య క్షుడు మాదారపు వెంకటేష్‌, కార్యకర్తలు జల్లు రాజీవ్‌, విభూది సూరిబాబు, తోణంగి వెంకన్నయాదవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:22 AM