అమెరికా కరెన్సీ చూపి.. సొమ్ము దోచుకుని..
ABN , Publish Date - Jan 01 , 2024 | 11:41 PM
కవిటి పంచాయతీ పరిధిలోని కవిటికొత్తూరులో ఉన్న పెట్రోల్బంకులో ఆదివారం ఓ వ్యక్తి సొమ్ముదోచుకున్నాడని ఫిర్యాదు అందిందని ఏఎస్పీ కూర్మారావు తెలిపారు.
![అమెరికా కరెన్సీ చూపి.. సొమ్ము దోచుకుని..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- కవిటి కొత్తూరు పెట్రోల్ బంకులో రూ.12,500తో పరారీ
కవిటి: కవిటి పంచాయతీ పరిధిలోని కవిటికొత్తూరులో ఉన్న పెట్రోల్బంకులో ఆదివారం ఓ వ్యక్తి సొమ్ముదోచుకున్నాడని ఫిర్యాదు అందిందని ఏఎస్పీ కూర్మారావు తెలిపారు. ఏఎస్పీ కథనం మేరకు.. బంకులో పనిచేస్తున్న జి.శ్రీనివాసరావు వాహనాలకు పెట్రోల్ కొడుతున్నాడు. ఆ సమయంలో వాహనచోదకులు ఇచ్చిన సొమ్మును చేతిలో పట్టుకుని పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి అమెరికా కరెన్సీ మార్చు చేసి పెట్రోల్ వేయమన్నాడు. ఇక్కడ కరెన్సీ మార్పునకు కుదరదని విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు చెప్పాడు. ఇంతలో రెప్పపాటులో ఆయన చేతిలో ఉన్న రూ. 12,500 బలవంతంగా లాక్కొని వాహనంపై పరారయ్యాడు. శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేశారు.