‘రా..కదలిరా’తో వైసీపీలో వణుకు
ABN , Publish Date - Feb 27 , 2024 | 11:53 PM
శ్రీకాకుళంలో నిర్వహించిన రా కదలిరా సభ విజయవంతంకావడంతో వైసీపీ నాయకుల్లో వణుకు మొదలయ్యిందని తెలుగుదేశం పార్టీ నాయ కులు తెలిపారు.ఈ మేరకు మంగళవారం జిల్లాలో పలువురు టీడీపీ నాయ కులు విలేకరులతో మాట్లాడారు.
![‘రా..కదలిరా’తో వైసీపీలో వణుకు](https://media.andhrajyothy.com/media/2024/20240227/PSR_1098_0cf5db2680.gif)
శ్రీకాకుళంలో నిర్వహించిన రా కదలిరా సభ విజయవంతంకావడంతో వైసీపీ నాయకుల్లో వణుకు మొదలయ్యిందని తెలుగుదేశం పార్టీ నాయ కులు తెలిపారు.ఈ మేరకు మంగళవారం జిల్లాలో పలువురు టీడీపీ నాయ కులు విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం: రవికుమార్
అరసవల్లి : రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసిన దేశంలోనే ఏకైక నాయకుడు జగన్రెడ్డి అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికు మార్ ఎద్దేవాచేశారు.శ్రీకాకుళంలో జరిగిన చంద్రబాబు రా...కదలిరా సభకు హాజరైన జనసందోహాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు గల వ్యతిరేకత ఏపాటిదో అర్థమవుతుందని తెలిపారు. మంగళవారం స్థానిక 80 అడుగుల రోడ్డులో గల జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. రాకదలిరాసభకు జిల్లా నలుమూలల నుంచి స్వచ్ఛందం గా వేలాదిగా ప్రజలు తరలివచ్చారన్నారు. వైసీపీ, జగన్రెడ్డి, ఇతర నా యకులపై ప్రజలు చూపించిన వ్యతిరేతకు ఈ సభ అద్ధం పడుతోందని చెప్పారు. విద్య, వైద్యం, కార్మిక, ఆరోగ్యం తదితర అన్ని రంగాలను వైసీపీ ధ్వసం చేసిందని, చివరకు క్రీడారంగాన్ని కబ్జా చేసి , పూర్తిగా కలుషితం చేస్తోందని,ఇందుకు నిదర్శనమే ఆంధ్రా రంజీటీమ్ కెప్టెన్ హనుమ విహారి ఉదంతమని తెలిపారు. జాతీయ జట్టుకు ప్రాతి నిథ్యం వహించి, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి పట్ల వైసీపీ నాయకులు అలా ప్రవర్తించడం హేయమని పేర్కొన్నారు. అసలు జగన్ అరాచ కానికి గురికాని రంగమే లేకుండా పోయిందని, ఆడుదాం....ఆంధ్ర పేరుతో క్రీడాకారులకు నాసిరకం క్రీడా పరికరాలను సప్లై చేసి కాసుల కక్కుర్తికి తెరలేపిన వైనం దారుణమన్నారు. చంద్రబాబు రా కదలిరా సభను విజ యవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్ర మంలో రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పీఎంజే బాబు, బొనిగి భాస్కరరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమణమాదిగ, రాష్ట్ర తెలుకుల సాధికార సమితి డైరెక్టర్ కొమ్మనాపల్లి వెంక టరామరాజు పాల్గొన్నారు.
ప్రజలు విసిగిపోయారు: గుండ లక్ష్మీదేవి
వైసీపీ విధానాల పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయి ఉన్నారని, శ్రీకా కుళంలో జరిగిన చంద్ర బాబు రా...కదలిరా సభ నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుండ లక్ష్మీదేవి తెలిపారు. మంగళవారం అరసవల్లిలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు రాకదలిరా సభకు హాజరైన అశేష ప్రజానీకం ఉత్సాహాన్ని చూస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. చంద్రబాబు పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. అశేష జనవాహినిని చూసి వైసీపీ నేతలకు వెన్నులో వణుకు పుట్టిందని, సభ పూర్తి కాకుండానే విమర్శించడం వారిలోని ఓటమి భయానికి నిదర్శనమని తెలిపారు.
బాబు పర్యటనతో రెట్టింపు ఉత్సాహం
గార: శ్రీకాకుళంలో సోమవారం జరిగిన చంద్రబాబునాయు డు ఆధ్వర్యంలో రా కదలిరా కార్యక్రమం నిర్వహణతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సా హం రెట్టింపయ్యిందని టీడీపీ నాయకులు ఎల్.రాధాకృష్ణరెడ్డి, జల్లు రాజీవ్, పి.కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. సభ విజయ వంతం కావడంతో కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలుతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు.