Share News

చిరంజీవిపై సజ్జల వ్యాఖ్యలు సిగ్గుచేటు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:47 PM

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ప్రముఖ సినీహీరో, మెగాస్టార్‌ చిరంజీవి పిఠాపురం వస్తుంటే ఆయనపై వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, సజ్జల ఓ సన్నాసి అని కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ఆలేటి ప్రకాష్‌ అన్నారు.

చిరంజీవిపై సజ్జల వ్యాఖ్యలు సిగ్గుచేటు
మాట్లాడుతున్న కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ప్రకాష్‌

కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ప్రకాష్‌

అరసవల్లి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ప్రముఖ సినీహీరో, మెగాస్టార్‌ చిరంజీవి పిఠాపురం వస్తుంటే ఆయనపై వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, సజ్జల ఓ సన్నాసి అని కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ఆలేటి ప్రకాష్‌ అన్నారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కాపులకు ఆర్థిక, ఉపా ధి అవకాశాల్లో తీవ్ర అన్యాయం చేసిందని, కాపు రిజర్వేషన్లను సైతం భ్రష్టు పట్టించిందని విమర్శించారు. వ్యవస్థలను విధ్వంసం చేసిందని, ఉద్యోగ, ఉపాధి కల్పనలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం, చంద్రబాబు నాయ కత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం తథ్యమని, ఎన్డీఏను గెలిపించుకో వాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాస్‌, టీడీపీ నగర అధ్యక్షుడు మాదా రపు వెంకటేష్‌, నేతలు చిట్టి నాగభూషణరావు, పాండ్రంకి శంకర్‌, పెద్ది కవిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:47 PM