Share News

రంగనాథ స్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:44 PM

ఫరీద్‌పేటలో రంగనాథ స్వామి ఆలయ పునః ప్రారంభోత్స వాలు గత నాలుగు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి.

రంగనాథ స్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు
స్వామివారి విగ్రహానికి పూజలు చేస్తున్న దృశ్యం

ఎచ్చెర్ల: ఫరీద్‌పేటలో రంగనాథ స్వామి ఆలయ పునః ప్రారంభోత్స వాలు గత నాలుగు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. గత నెల 31న ప్రారంభమైన ఈ ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ మేరకు బుధవారం రంగనాథ స్వామి ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజకుంభారాధన, వాస్తు ఆరా ధన, మూలమంత్ర వాహనం, పంచశయ్యాధివాసం, విష్ణు సహస్రనామ పారాయణ తదితర పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. గురువా రం ద్వారాతోరణ, యంత్ర, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, విశేష అర్చన పూజలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. చినజీయర్‌స్వామి, అహోబిల జీయర్‌స్వామి పర్యవేక్షణలో రంగనాథ స్వామి మూల విరాట్‌ పునః ప్రతిష్ఠోత్సవం గురువారం ఉదయం 11.42 గంటలకు చేపట్టనున్న పేర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.

Updated Date - Apr 03 , 2024 | 11:44 PM