Share News

కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్‌ ఇంజక్షన్ల అందజేత

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:47 PM

స్థానిక కిడ్నీ ఆసుపత్రిలో డయాలసిస్‌ రోగులకు జనసేన పార్టీ సమన్వయకర్త దుర్గారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు మంగళ వారం ఉచితంగా ఎరిత్రో పోయుటెన్‌ ఇంజక్షన్లు ఉచితంగా పంపిణీ చేశారు.

కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్‌ ఇంజక్షన్ల అందజేత
ఇంజక్షన్లు అందిస్తున్న టీడీపీ-జనసేన నాయకులు

పలాస: స్థానిక కిడ్నీ ఆసుపత్రిలో డయాలసిస్‌ రోగులకు జనసేన పార్టీ సమన్వయకర్త దుర్గారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు మంగళ వారం ఉచితంగా ఎరిత్రో పోయుటెన్‌ ఇంజక్షన్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ మందులను ఉచితంగా అందించేదని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో నిలిపివేసిందన్నారు. దీంతో రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జనసేన-టీడీపీ- బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత మందులు పునరుద్ధరిస్తా మన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు ఎన్‌.ధర్మారావు, కె.కృష్ణారావు, వంశీ చౌదరి, బడ్డ నాగరాజు, గాలి కృష్ణారావు, తామాడ రాము, దినేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:47 PM