Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి: ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:09 AM

బాలిగాం జాతీయరహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి: ఇద్దరికి గాయాలు

హరిపురం: బాలిగాం జాతీయరహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. కవిటి మండలం దూగానపుట్టుగకి చెందిన బల్ల జోగారావు (52), బంధువులు శేషమ్మ (42), జస్వంత్‌(9)తో కలిసి ద్విచక్ర వాహనంపై వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురంలో జరిగిన శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా బాలిగాం వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో జోగారావు అక్కడిక్కడే మృతిచెందగా శేషమ్మ, జస్వం త్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు హరిపురం ఆసుపత్రికి తరలించి చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోదూరు వద్ద మరో వ్యక్తి..

హిరమండలం: మండలంలోని భగీరథపురం-బొంతు మార్గంలో కోదూరు గ్రామం సమీపంలో శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పిన ఘటనలో దాసుపురానికి చెందిన సిద్ధమడుగుల శంకరరావు(26) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శంకరరావు గ్లాస్‌ ఫిట్టిండ్‌ వర్క్‌ చేస్తుంటాడు. భార్య ఆశ గర్భవతి కావడంతో 15 రోజుల నుంచి సవితిసీదిలో కన్నవారింట్లోనే ఉంటోంది. శంకరరావు ఎప్పటిలాగే పని ముగించుకుని శనివారం అత్తవారింటికి వెళ్లాడు. అక్కడి నుంచి సోదరి గ్రామం కోదూరు వెళ్లి తిరుగు ప్రయాణంలో రాత్రి 12 గంటల సమయంలో బైక్‌ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడిం ది. తలకి బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇతనికి వివాహమై రెండేళ్లు మాత్రమే అయింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నారాయణ స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:09 AM