Share News

జూన్‌ 29న జాతీయ లోక్‌అదాలత్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:46 PM

జాతీయ లోక్‌ అదాలత్‌ జూన్‌ 29న నిర్వహిస్తామని జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలోని కోర్టు ఆవరణలో.. పోలీసులు, ఇన్సూరెన్స్‌, న్యాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

జూన్‌ 29న జాతీయ లోక్‌అదాలత్‌

గుజరాతీపేట, ఏప్రిల్‌ 26: జాతీయ లోక్‌ అదాలత్‌ జూన్‌ 29న నిర్వహిస్తామని జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలోని కోర్టు ఆవరణలో.. పోలీసులు, ఇన్సూరెన్స్‌, న్యాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రధాన కోర్టు సముదాయంతోపాటు ఆమదావలస, ఇచ్చాపురం, పాలకొండ, పలాస, పాతపట్నం, రాజాం, సోంపేట, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, కొత్తూరు, పొందూరు కోర్టుల్లో.. జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం చూపేలా.. ఎక్కువ కేసులు రాజీకి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, ఏఎస్పీ, డీఎస్పీలు, పోలీసు అధికారులు, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ మెట్ట మల్లేశ్వరరావు, పీపీలు నాగభూషణరావు, సుశీల, తంగి శివప్రసాద్‌, వాన కృష్ణచంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:46 PM