Share News

జాతీయ లోక్‌ అదాలత్‌ 16కి వాయిదా

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:34 PM

శివరాత్రి కారణంగా మార్చి 9న నిర్వహించాల్సిన జాతీయ లోక్‌అదాలత్‌ను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్‌ ఆహ్మద్‌ మౌలానా తెలిపారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ 16కి వాయిదా
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా న్యాయాధికారి జేఏ మౌలానా

గుజరాతీపేట, ఫిబ్రవరి 27: శివరాత్రి కారణంగా మార్చి 9న నిర్వహించాల్సిన జాతీయ లోక్‌అదాలత్‌ను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్‌ ఆహ్మద్‌ మౌలానా తెలిపారు. మంగళవారం కోర్టు ఆవరణలో ఆయన మాట్లాడుతూ.. 16న జిల్లాకేం ద్రంతోపాటు పాటు ఆమదావలస, కోటబొమ్మాళి, పాలకొండ, పలాస, పాతపట్నం, రాజాం, సోంపేట, టెక్కలి, సరన్నపేట, కొత్తూరు, పొందూరు, ఇచ్ఛాపురం కోర్టుల్లో లోక్‌అదాలత్‌ నిర్వహిస్తామన్నారు. సివిల్‌, క్రిమినల్‌, మోటార్‌ ఇన్స్యూరెన్స్‌, బ్యాంకుకు సంబంఽధించినవి, ప్రీ లిటికేషన్‌ స్థాయిలో ఉండే కేసుల కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:34 PM