Share News

నమో.. వేంకటేశా..

ABN , Publish Date - May 20 , 2024 | 12:07 AM

నరసన్నపేట వేంకటేశ్వరుని దేవస్థానంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

నమో.. వేంకటేశా..

నరసన్నపేట వేంకటేశ్వరుని దేవస్థానంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆదివారం సుప్రభాతం సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వరుని పూజ, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాస ఉత్సవ మూర్తులను హంస వాహనంపై పట్టణ వీధుల్లో తిరువీధిగా అంగరంగ వైభవంగా ఊరేగించారు. వేలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోలాటం, తప్పెటగుళ్లు, కూచిపూడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, మావుడూరి జగదీష్‌ ఆధ్వర్యంలో సత్యవర అగ్రహారం రుత్వీకుల సమక్షంలో ఉత్సవాలు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

- నరసన్నపేట

Updated Date - May 20 , 2024 | 12:07 AM