కొత్తమ్మతల్లి ఆలయంలో ఎంపీ పూజలు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:23 AM
ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, సతీమణి శ్రావ్యతో కలిసి బుధ వారం నామినేషన్ వేసేందుకు శ్రీకాకుళం వెళుతూ ముందుగా స్వగ్రామమైన నిమ్మాడలో గ్రామ దేవత అమ్మ వారిని, కోటబొమ్మాళిలోని కొత్తమ్మ తల్లిని దర్శించుకొని నామినేషన్ పత్రాలుంచి ప్రత్యేక పూజలు చేశారు.
టెక్కలి: ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, సతీమణి శ్రావ్యతో కలిసి బుధ వారం నామినేషన్ వేసేందుకు శ్రీకాకుళం వెళుతూ ముందుగా స్వగ్రామమైన నిమ్మాడలో గ్రామ దేవత అమ్మ వారిని, కోటబొమ్మాళిలోని కొత్తమ్మ తల్లిని దర్శించుకొని నామినేషన్ పత్రాలుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ పత్రాలపై సంతకం చేశారు. కార్య క్రమంలో దివంగత నేత ఎర్రన్నాయుడు సతీమణి విజయలక్ష్మి, హరి వరప్రసాద్, అచ్చెన్నా యుడు భార్య విజయమాధవి, బోయిన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
రామయ్యపుట్టగలో హారతులిచ్చి..
కవిటి: ఇచ్ఛాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా బెందాళం అశోక్ నామినేషన్ వేసేందుకు బుధవారం స్వగ్రా మం రామయ్య పుట్టుగలో బయలుదేరగా టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆయనను అభి నందించారు. స్వగృహం వద్ద మహిళలు కుంకుమ బొట్టు పెట్టి హారతులిచ్చి విజయం చేకూరా లని ఆకాంక్షించారు. అనంతరం ర్యాలీగా ఇచ్ఛాపురం బయలుదేరి వెళ్లారు.